Skip to main content
దేశంలో తీవ్ర నీటి ఎద్దడి రానుందని ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్​ నివేదిక హెచ్చరిస్తోంది. 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి కనీసం తాగు నీరు దొరకదని నివేదికలో వెల్లడైంది. 2020 నాటికి దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​ వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతాయని పేర్కొంది.
సరైన వర్షాలు లేకపోవటం వల్ల దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. భూగర్భ జలాలపై ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్​ నివేదిక చేదు వార్తను వెల్లడించింది. నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టకుంటే... 2020 నాటికి దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్​, చెన్నై వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతాయని పేర్కొంది.
నివేదిక ప్రకారం 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి కనీసం తాగు నీరు దొరికే పరిస్థితులు లేవని హెచ్చరించింది. నీటి వనరుల సంరక్షణ చర్యలు చేపట్టకుంటే తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
2020 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే చర్యలు చేపట్టక తప్పదు. చెన్నైలో మూడు నదులు, నాలుగు నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
" చెన్నైలో నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం ఉప్పు నీటి శుద్ధిపై ఆధారపడుతోంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. భూమి చాలా చిన్నదని వారు మరిచిపోతున్నారు. సముద్రాలు కూడా ఇంకిపోతాయి. మన పిల్లలు, మనుమలకు మనం ఏమి వదులుతున్నాం? మన దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు కానీ నీటికి బదులుగా డబ్బును తాగమని పిల్లలకు చెప్పలేం. సముద్ర నీటిని శుద్ధి చేయటం సమస్య పరిష్కార మార్గం కాదు. కానీ నీటి వనరుల సంరక్షణే సరైంది. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి పని చేయాల్సిన బాధ్యత ఉంది. "
- మనోహర్​ ఖుషాలని, నేషనల్​ వాటర్​ అకాడమీ మాజీ డైరెక్టర్

Comments

Popular posts from this blog

Top 5 HD wallpaper

Top 5 wallpapers HD for you Alone Pikachu 😔  Crazy monkey 🤪  Dangerous smile Alone piece Spider-Man 🕸 

శ్రావణ శుక్రవారం ఈ సమయంలో చీపురుతో ఇంటిని ఊడ్చితే దరిద్రం పట్టుకుంటుంది

శ్రావణ శుక్రవారం ఈ సమయంలో చీపురుతో ఇంటిని ఊడ్చితే దరిద్రం పట్టుకుంటుంది

అమెజాన్ స్కాన్ మరియు పే ఆఫర్ - 2100 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందండి

అమెజాన్ స్కాన్ మరియు పే ఆఫర్ అమెజాన్ స్కాన్ మరియు పే ఆఫర్ - అమెజాన్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు కనీస రూ .350 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేసినప్పుడు అమెజాన్ రూ .2100 క్యాష్‌బ్యాక్ వరకు ఆఫర్ చేస్తోంది . అమెజాన్‌లో కనీసం ఒక్కసారైనా కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ చెల్లుతుంది. కాబట్టి క్రింది దశలను అనుసరించండి మరియు ఈ ఆఫర్ పొందండి. ఈ అమెజాన్ పే యుపిఐ ఆఫర్‌ను ఎలా పొందాలి 1. మొదట అమెజాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి -ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇప్పుడు అమెజాన్‌లో క్రొత్త ఖాతాను లాగిన్ చేయండి లేదా నమోదు చేయండి 3. ఆపై యుపిఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అమెజాన్ లావాదేవీ చేయండి SPONSORED AD 4. అమెజాన్ ₹ 350 లేదా అంతకంటే ఎక్కువ మీ లావాదేవీని పూర్తి చేయండి. 5. మీకు రూ .65 - 2100 మధ్య క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 6. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఆస్వాదించండి. నిబంధనలు & షరతులు: -